Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అసెంబ్లీ సమావేశాలు: పెషావర్ ఘటనకు సంతాపం వాయిదా..

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (12:01 IST)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వెంకటరమణ మరణం తీరని లోటు అని అభిప్రాయపడ్డారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావించే వ్యక్తి అని, ఎవరికీ ఇబ్బంది కలిగించని వ్యక్తి అని తెలిపారు. 40 వేలకు పైగా మెజారిటీతో గెలిచాడంటే ఆయనకు ఎంత పాప్యులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు అని చంద్రబాబు చెప్పారు. సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత స్థానానికి ఎదిగారని చెప్పారు. 
 
ఏపీ శాసనసభ శుక్రవారానికి వాయిదాపడింది. శీతాకాల సమావేశాలు ఈ ఉదయం ఆరంభం కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దానిపై నేతలు మాట్లాడారు. దాని తర్వాత, పెషావర్ లో మరణించిన వారికి సభ సంతాపం తెలిపింది. సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం, స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments