Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి పొంచివున్న మరో తుఫాన్.. భయపడుతున్న రైతులు

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2023 (16:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మిచౌంగ్ తుఫాను అతలాకుతలం చేసింది. దక్షిణ కోస్తా తీర జిల్లాల్లో అపార నష్టాన్ని చేకూర్చింది. ముఖ్యంగా రైతులను కోలుకోకుండా దెబ్బతీసింది. చేతికి వచ్చిన వంట వరద నీటిలో మునిగిపోయింది. దీంతో రైలుతు లబోదిబో మంటున్నారు. ఈ నష్టం నుంచి కోలుకోకముందే, ఏపీకి మరో తుఫాను గండం పొంచివుంది. బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. 
 
దీని ప్రభావం కారణంగా వచ్చే ఐదు రోజుల్లో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ అరేబియాలో తుఫాను వాతావరణం నెలకొనివుందని తెలిపింది. ఇది మాల్దీవులకు సమీపంలో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని, దీంతో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
దీని ఫలితంగా వచ్చే ఐదు రోజుల పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షద్వీప్‌ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా, దీని ప్రభావం ఎక్కువగా కేరళపై ఉంటుందని తెలిపింది. అదేసమయంలో తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలను దాటుకుని ఏపీకి రావడానికి కొంత సమయం పడుతుందని పేర్కొంది. ఈ అల్పపీడనం తుఫానుగా మారి ఏపీ వైపుగా వస్తే ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

కాటన్ దొర సైతం డొక్కా సీతమ్మ ని లండన్‌కు రమ్మన్నారు : మురళీ మోహన్

జెరెమీ ఐరన్స్ తో హాలీవుడ్‌ లో నటించే కల నెరవేరింది: వరలక్ష్మి శరత్‌కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments