Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి పొంచివున్న మరో తుఫాన్.. భయపడుతున్న రైతులు

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2023 (16:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మిచౌంగ్ తుఫాను అతలాకుతలం చేసింది. దక్షిణ కోస్తా తీర జిల్లాల్లో అపార నష్టాన్ని చేకూర్చింది. ముఖ్యంగా రైతులను కోలుకోకుండా దెబ్బతీసింది. చేతికి వచ్చిన వంట వరద నీటిలో మునిగిపోయింది. దీంతో రైలుతు లబోదిబో మంటున్నారు. ఈ నష్టం నుంచి కోలుకోకముందే, ఏపీకి మరో తుఫాను గండం పొంచివుంది. బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. 
 
దీని ప్రభావం కారణంగా వచ్చే ఐదు రోజుల్లో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ అరేబియాలో తుఫాను వాతావరణం నెలకొనివుందని తెలిపింది. ఇది మాల్దీవులకు సమీపంలో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని, దీంతో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
దీని ఫలితంగా వచ్చే ఐదు రోజుల పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షద్వీప్‌ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా, దీని ప్రభావం ఎక్కువగా కేరళపై ఉంటుందని తెలిపింది. అదేసమయంలో తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలను దాటుకుని ఏపీకి రావడానికి కొంత సమయం పడుతుందని పేర్కొంది. ఈ అల్పపీడనం తుఫానుగా మారి ఏపీ వైపుగా వస్తే ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments