Webdunia - Bharat's app for daily news and videos

Install App

15న ఏపీలో కొత్త జిల్లాల ప్రకటన?

Webdunia
సోమవారం, 13 జులై 2020 (09:32 IST)
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఒక పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా మారబోతోంది. ఇప్పుడున్న 13 జిల్లాలు 25 జిల్లాలు అవుతాయి.

ఈ నెల 15  జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై అధికారికంగా నిర్ణయం ప్రకటించబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇది కేవలం లాంఛనమే. అధికారంలోకి రాగానే జిల్లాల విభజన జరుగుతుందని జగన్ 
 
గతంలో చెప్పారు. ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంటు నియోజక వర్గాన్ని ఒక జిల్లా  చేస్తామని చెప్పారు. అంటే ఈ లెక్కన 25 జిల్లాలు అవుతాయి.

ప్రస్తుత జిల్లాల్లో ఒక్కోటి రెండుగానో మూడుగానో విభజితమవుతుంది. జిల్లాల విభజనపై  వైసీపీ నాయకుల, ఎమ్మెల్యేల మనస్సుల్లో ఏముందో తెలియదుగాని ఇప్పటివరకైతే ఎవరూ వ్యతిరేకించలేదు. 
 
కానీ వారిలో ఈ విభజన పట్ల తీవ్ర అసంతృప్తి వున్నట్లు పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ కారణంగా జిల్లాల విభజన జగన్ కు మరిన్ని తల నొప్పులు తెచ్చి పెడుతుందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments