Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వాలంటీర్లు

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (08:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లు అధికార నేతల అండదండలతో రెచ్చిపోతున్నారు. నేరాలు ఘోరాలకు పాల్పడుతున్నారు. కొందరు వాలంటీర్లు హద్దు దాటిపోయి హత్యలు, అత్యాచారాలకు పాల్పడ్డారు. తాజాగా ఇద్దరు వాలంటీర్లు కర్నాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారు. 
 
ఏపీలోని అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానిక అంగళ్లు పాత ట్యాంకు వీధిలో కర్ణాటక మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో జిల్లా అదనపు ఎస్పీ రాజ్‌కమల్‌ ఆదేశాలపై మదనపల్లె సెబ్‌ గురువారం తనిఖీలు నిర్వహించింది. 
 
అంగళ్లు క్లస్టరు-19 వాలంటీరు అవర దాసరి సందీప్‌కుమార్‌, మరో మహిళా వాలంటీరు లేపాక్షి అమ్మాజీ, కర్ణాటకలోని రాయల్పాడుకు చెందిన ఆర్‌.ఎస్‌.నడిపిరెడ్డిని అరెస్టు చేసింది. వీరి నుంచి ఆటోతోపాటు రూ.35 వేల విలువైన 480 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుంది. 
 
నిందితులను కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండు విధించారు. ఓ వైకాపా నాయకుడి అండదండలతోనే కర్ణాటక మద్యం విక్రయాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ వైకాపా నాయకుడి వద్ద విచారణ జరిపేందుకు పోలీసులు వెనుకంజ వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments