Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌలు రైతు భరోసాకు చిరంజీవి తల్లి అంజనా దేవి ఆర్థిక సాయం

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (21:57 IST)
జనసేన పార్టీ తరపున కౌలు రైతులను ఆదుకునే బృహత్తర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఇందులోభాగంగా, ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కౌలు రైతులకు తన వంతు ఆర్థిక సాయం చేస్తున్నారు. అయితే, రైతు భరోసా యాత్ర ప్రత్యేక నిధికి ఆయన తల్లి అంజనాదేవి తనవంతు సాయంగా రూ.లక్ష విరాళం అందించారు. 
 
అలాగే, జనసేన పార్టీకి మరో రూ.లక్ష విరాళం ఇచ్చారు. తన భర్త, హీరో పవన్‌ తండ్రి వెంకట్రావు జయంతి సందర్భంగా విరాళం చెక్కును హైదరాబాద్‌లో ఆమె అందజేశారు. తన తండ్రి పింఛను డబ్బులను ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ఇచ్చినందుకు తల్లికి పవన్‌ కృతజ్ఞతలు తెలిపారు.
 
ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ... కౌలు రైతుల భరోసాయాత్ర నిధి, జనసేన పార్టీకి విరాళం అందించిన తన తల్లికి కృతజ్ఞతలు తెలిపారు. 'సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్నే కొనసాగించాలని ఎందుకు కోరుకుంటానంటే అది మా ఫ్యామిలీకి భావోద్వేగంతో కూడుకున్నది. అందుకే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని తీసుకురావడానికి మా వంతు ప్రయత్నిస్తాం. ఉద్యోగులకు అండగా ఉంటాం' అని పవన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నం తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments