Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్పీ దిగాడనీ కొట్టి చంపేశారు.. కంచిలో తెలుగు యువకుడిపై ఖాకీల దాష్టీకం

Webdunia
గురువారం, 4 జులై 2019 (12:55 IST)
కాంచీపురంలోని శ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయంలో 40 యేళ్లకు ఒకసారి జరిగే అత్తివరదర్ ఉత్సవాలు ఈ నెల ఒకటో తేదీ నుంచి ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. ఈయన స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారితో సెల్ఫీ దిగాడు. దీన్ని గమనించిన విధుల్లో వుండే పోలీసులు.. ఆ యువకుడుని పట్టుకుని చితకబాదారు. దాంతో ఖాకీల దెబ్బలకు తాళలేక ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ విషాదకర సంఘటన గురువారం ఉదయం కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో జరిగింది. మృతి చెందిన యువకుడి పేరు ఆకాష్. రాజమండ్రి వాసి. ఆలయంలో బంగారు బల్లిని దర్శనం తర్వాత స్వామి వారిని దర్శనం చేసుకుని సెల్ఫీ తీసుకున్నాడు. ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులు... ఆకాష్ సెల్ఫీ దిగడంపై ఆగ్రహిస్తూ ముష్టిఘాతాలు కురిపించారు. దీంతో ఆకాష్ అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. 
 
తన బిడ్డను పోలీసులు కొట్టి చంపారంటూ మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, పోలీసులు మాత్రం మరోరకంగా స్పందిస్తున్నారు. గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడని చెపుతున్నారు. మృతదేహాన్ని కంచి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఎంతో వైభవంగా జరుగుతున్న అత్తి వరదర్ వేడుకల్లో అకాష్ మృతి ఆలయంలో కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments