Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఈసీకి పోటీగా వైకాపా సర్కారు ప్రత్యేక యాప్: పేరు ఈ-నేత్ర

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (17:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే తొలిదశ ఎన్నికల ప్రచారం ముగింది. ఈ నెల7వ తేదీన తొలి దశ పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫిర్యాదు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దీనిద్వారా ఎన్నికల సంబంధించిన ఫిర్యాదులు చేయొచ్చని తెలిపింది. అదేసమయంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యం ఫిర్యాదులకు వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను ప్రారంభించింది. ఈ- నేత్రం పేరుతో ఆ పార్టీ యాప్‌ను విడుదల చేసింది. 
 
ఈ యాప్‌ ద్వారా క్షేత్రస్థాయిలో ఎక్కడి నుంచైనా, ఎవరైనా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. ఫొటోలు, వీడియోలు సైతం అప్‌లోడ్‌ చేసే సౌలభ్యంతో యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అక్రమాలు, ప్రలోభాలు, ఇతర సమస్యలపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని పేర్కొంది.
 
ఇదిలాఉండగా ఎన్నికల ఫిర్యాదులకు వైసీపీ ప్రత్యేక యాప్‌ తీసుకురావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫిర్యాదులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ బుధవారం ఉదయం 11 గంటలకు ఈ-వాచ్‌ పేరుతో యాప్‌ను విడుదల చేయగా.. దీనికి కౌంటర్‌గానే వైసీపీ మరో యాప్‌ రూపొందించినట్లు చర్చ నడుస్తున్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments