Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాచర్ల మున్సిపాలిటీలో ఖాళీ అవుతున్న వైకాపా...

ఠాగూర్
శుక్రవారం, 16 ఆగస్టు 2024 (08:49 IST)
పల్నాడు జిల్లాలోని మాచర్ల నగర పాలక సంస్థలో గత ఐదేళ్ళుగా ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చిన వైకాపాకు ఇపుడు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే 14 మంది వైకాపా కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. తాజాగా మున్సిపల్ చైర్మన్ చిన్న ఏసోబు, వైస్ చైర్మన్ నరసింహా రావు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. గురువారం స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డితో వారిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో వీరిద్దరూ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. 
 
కాగా, మాచర్ల మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులు ఉండగా గత 2022లో జరిగిన ఎన్నికల్లో అన్ని వార్డుల్లో ఏకగ్రీవాలతో వైకాపా సొంతం చేసుకుంది. అధికారం తమ చేతుల్లో ఉండటంతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురి నామినేషన్లు దాఖలు చేయకుండా చేసి ఏకగ్రీవాలు చేయించుకుంది. ముఖ్యంగా, అపుడు ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్ రెడ్డిల సారథ్యంలో మాచర్లలో రౌడీ రాజ్యం సాగింది. 
 
కానీ, ఇపుడు వైకాపా స్థానంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో మాచర్ల రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి వైకాపా నేతలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. దీంతో 14 మంది వైకాపా కౌన్సిలర్లు టీడీపీలో చేరగా, ఇపుడు చైర్మన్, వైఎస్ చైర్మన్‌లు కూడా చేరిన పక్షంలో మాచర్ల మున్సిపాలిటీలో టీడీపీ బలం 16కు చేరుతుంది. ఆ తర్వాతకూడా మరికొందరు వైకాపా కౌన్సిలర్లు టీడీపీ, జనసేన, బీజేపీలలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం లోకేష్, కూటమి చైర్మన్ చంద్రబాబు: కలలు కంటున్న తమ్మారెడ్డి

బ్యాచ్‌లర్స్ జీవితంలో స్ట్రగుల్స్ ను మజాకా చేసుకుంటున్న సందీప్ కిషన్

Akira Nandan: అకీరా నందన్‌తో కలిసి పనిచేసేందుకు రెడీ.. విష్ణు వర్ధన్

వియత్నాంలో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ ప్రీ ప్రొడక్షన్ చర్చలు

ఇంట్లోనే పురుషులుంటే.. వీధుల్లోకి మహిళలు వెళ్తే పరిస్థితి ఏంటి? చిన్మయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

తర్వాతి కథనం
Show comments