Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ: నేడే 10th ఫలితాలు.. అందరు పాస్ అవుతారు కానీ..?

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (10:09 IST)
ఏపీలో 10th ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ట్రాలు పరీక్షల నిర్వహణ నిలిపివేశాయి. ఇక ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని పాస్ చేస్తున్నాయి ఆయా బోర్డులు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఫలితాలు వెల్లడించాయి. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది ఫలితాలు వెల్లడించనుంది.
 
సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఆర్ అండ్ బీ భవనంలో రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలు విడుదల చేయనున్నారు. అయితే విద్యార్థులు అందరు పాస్ అవుతారు కానీ ఇందులో మార్కులే వారి భవిష్యత్తుకు చాలా కీలకం అవుతాయి. దీంతో తమకు మార్కులు ఎన్ని కేటాయిస్తున్నారు? ఎలా కేటాయిస్తున్నారు అన్న దానిపై ఇటు విద్యార్థుల్లో, అటు తల్లిదండ్రులల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
 
2020 మార్చి నుంచి 2021 జూన్‌కు సంబంధించిన విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఏ. సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ ఫలితాలను www.bse.ap.gov.inతో పాటు ఇతర ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల మెమొరాండమ్‌ ఆఫ్‌ సబ్జెక్టు వైజ్‌ పెర్‌ఫార్మెన్స్‌‌లను తమ పాఠశాల లాగిన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని డైరెక్టర్‌ సుబ్బారెడ్డి సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments