Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యాటక బోట్లపై నిరంతర నిఘా : ఏపీ సర్కారు నిర్ణయం

Webdunia
సోమవారం, 18 నవంబరు 2019 (10:20 IST)
పర్యాటక బోట్లపై నిరంతరం నిఘా సారించేలా ఓ కార్యాచరణను రూపొందిస్తున్నట్టు ఏపీ సర్కారు ప్రకటించింది. నదులు, తీర ప్రాంతంలో నడిపే పర్యటక బోట్లపై నిరంతరం పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 
 
తొమ్మిది చోట్ల పర్యవేక్షణ కేంద్రాలు(కాల్ సెంటర్లు) ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాల్లో కాల్ సెంటర్​కు భూమి పూజ చేయనున్నారు. రెవెన్యూ, జలవనరులు, పోలీసు, పర్యాటక శాఖల భాగస్వామ్యంతో ఇవి పని చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 
 
బోటు సామర్థ్యం, అందులో ప్రయాణించే వారి రక్షణ ఏర్పాట్లు, అర్హత కలిగిన బోటు ఆపరేటర్లు వంటి కీలక అంశాలు పరిశీలించాకే ఇకపై అనుమతులు ఇవ్వనున్నారు. బోటు ప్రయాణ ప్రారంభం నుంచి తిరిగి ఒడ్డుకు చేరుకునే వరకూ వీటిపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments