Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో ఒంటిపూట బడులు... నవంబరు 2 నుంచి పునఃప్రారంభం!

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (19:06 IST)
కరోనా లాక్డౌన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి. నవంబరు రెండో తేదీ నుంచి సుధీర్ఘకాలంగా మూతపడిన స్కూల్స్, కాలేజీల తలుపులు తెరుచుకోనున్నాయి. 
 
నవంబరు 2 నుంచి దశల వారీగా విద్యాసంస్థల పునఃప్రారంభం ఉంటుందని ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించగా, ఆ మేరకు రాష్ట్ర సీఎస్ నీలం సాహ్నీ తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తారు. అది కూడా ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహిస్తారు.
 
నవంబరు 2 నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకు, ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులకు క్లాసులు ఉంటాయి. నవంబరు 12 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు క్లాసులు జరుపుతారు. నవంబరు 23 నుంచి 6, 7, 8 తరగతుల విద్యార్థులకు బోధన ప్రారంభం అవుతుంది.
 
ఇకపోతే, 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు డిసెంబరు 14 నుంచి క్లాసులు నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఇవే నిబంధనలు వర్తిస్తాయి. 
 
కరోనా నియమావళికి అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని తరగతుల నిర్వహణ జరపాల్సి ఉంటుందని షెడ్యూల్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments