Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో 28 శాతం మేరకు పెరిగిన భూముల లావాదేవీలు!

Webdunia
గురువారం, 31 జులై 2014 (16:12 IST)
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల లావాదేవీల వసూళ్లు 28 శాతం మేరకు పెరిగాయి. ఈ విషయాన్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖకు వచ్చిన వసూళ్లు తేటతెల్లం చేస్తున్నాయి. 2014 జూన్ నెలలో ఈ శాఖకు మొత్తం 270.41 కోట్ల రూపాయల మేరకు వసూళ్లు కాగా, గత యేడాది అంటే 2013 జూన్ నెలలో ఈ వసూళ్లు రూ.185.81 కోట్లుగానే ఉంది. 
 
ప్రస్తుతం 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుంటూరు - విజయవాడలు జంట నగరాలు అయ్యే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతుండటంతో ఈ ప్రాంతంలో భూముల లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయ వసూళ్లు రూ.67.45 కోట్లు, రూ.53.93 కోట్లుగా ఉంది. 
 
ఇకపోతే తెలంగాణ విషయానికి వస్తే.. గత యేడాదితో పోల్చుకుంటే ఇక్కడ ఆదాయం తగ్గింది. 2014 జూన్ నెలలో మొత్తం వసూళ్లు రూ.200.45 కోట్లు కాగా, 2013 జూన్ నెలలో ఈ వసూళ్లు రూ.242.74 కోట్లుగా ఉంది. అయితే, రంగారెడ్డి, హైదరాబాద్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. 2014 జూన్ నెలలో హైదరాబాద్‌లో రూ.270 కోట్లు, రంగారెడ్డిలో రూ.115 కోట్లు చొప్పున వసూలయ్యాయి. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments