Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో సిగరెట్ కాల్చిన ప్రయాణికుడు అరెస్టు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (14:53 IST)
కువైట్ నుంచి చెన్నైకు వచ్చిన ఇండిగో విమానంలో సిగరెట్ కాల్చిన ప్రయాణికుడిని విమానాశ్రయ పోలీసులు అరెస్టు చేశారు. సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో పొగతాడగం కూడా నేరం. అలాంటిది ఏకంగా విమానంలో సిగరెట్ కాల్చి అందరినీ ఆందోళనకు గురిచేశాడు. 
 
కువైట్ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో 137 మంది ప్రయాణికులు ఉండగా… అందులో ఏపీకి చెందిన మహ్మద్ షరీఫ్ (57) అనే ప్రయాణికుడు ఉన్నాడు. ఈయన సొంతూరు ఆంధ్రప్రదేశ్. అతడు భద్రతా సిబ్బంది కళ్లు గప్పి తన లో దుస్తుల్లో దాచుకున్న సిగరెట్లను విమానంలోకి తీసుకువచ్చాడు.
 
విమానం టేకాఫ్ అయిన కాసేపటికి స్మోకింగ్ చేయడం ప్రారంభించాడు. తోటి ప్రయాణికులు వారించినా షరీఫ్ వినలేదు. దీంతో వాళ్లు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. చివరకు ఎయిర్‌ హోస్టెస్ వచ్చి చెప్పినా అతడు సిగరెట్ తాగడం ఆపలేదు. 
 
ఈ క్రమంలో ఎయిర్ హోస్టెస్, క్యాబిన్ సిబ్బందితో షరీఫ్ గొడవకు దిగాడు. దీంతో విమానం చెన్నైలో ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది షరీఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ తర్వాత చెన్నై ఎయిర్‌పోర్టులోని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.

సంబంధిత వార్తలు

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments