Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం అంటే భయం.. కృష్ణానదిలో దూకి వరుడు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (16:26 IST)
పెళ్లైన కొత్త.. శోభనం అంటేనే ఎగ్సైట్ మగాళ్ల మధ్య.. ఓ వరుడు శోభనానికి జడుసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు మాచర్లకు చెందిన కిరణ్ కుమార్ అనే యువకుడికి తెనాలికి చెందిన యువతితో ఈ నెల 11న వివాహం జరిగింది. 12వ తదీన వధువును తీసుకొని వరుడు మాచర్లకు వెళ్ళిపోయాడు. 
 
నాలుగు రోజుల తర్వాత 16వ తేదీన తెనాలిలో శోభనం ఏర్పాటు చేశారు. ఇందుకోసం తెనాలికి వస్తుండగా.. బస్టాండుకు రాగానే ఇప్పుడే వస్తానని చెప్పి కనబడకుండా వెళ్లిపోయాడు. 
 
రాత్రి వరకు ఎదురు చూసిన నూతన వధువు తన బంధువులకు సమాచారమిచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో చేసేది లేక, చీకటి పడుతుందని తెనాలి వెళ్లిపోయారు. 
 
ఇంతలో కృష్ణా నది ఎగువన ఓ గుర్తు తెలియని మృతదేహం ఉందన పోలీసులకు సమాచారం రావడంతో వారు శవాన్ని వెలికి తీశారు. జేబులో ఉన్న ఫోన్ సిమ్ తీసి బంధువులకు సమాచారమందించారు. మృతుడి తల్లి వచ్చి గుర్తు పట్టడంతో మృతదేహాన్ని అప్పగించారు. 
 
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మొదటి రాత్రి అంటే తన కొడుకు భయపడ్డాడని, స్నేహితులు ఎంత ధైర్యం చెప్పినా ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments