Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు : రెండు ఎమ్మెల్సీలూ టీడీపీ ఖాతాలోకే

Webdunia
మంగళవారం, 7 జులై 2015 (10:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ ఘన విజయం సాధించింది. ముఖ్యంగా కర్నూలు జిల్లా స్థానానికి జరిగిన ఎన్నికల్లో శిల్పా చక్రపాణి రెడ్డి విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలో టీడీపీ, వైసీపీ నేతలు విజయం తమదంటే, కాదు గెలుపు తమదేనని ప్రకటించుకున్నప్పటికీ... చివరకు విజయం మాత్రం శిల్పా చక్రపాణిరెడ్డిని వరిచింది. ఫలితంగా ఆయన సమీప వైకాపా ప్రత్యర్థి వెంకటేశ్వర రెడ్డిపై 120 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 
 
అలాగే, ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంలో టీడీపీ అభ్యర్థి మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయం సాధించారు. దీంతో స్థానిక కోటా కింద భర్తీ అయిన ఎమ్మెల్సీ స్థానాలన్నీ టీడీపీ ఖాతాలోకి చేరాయి. ఒంగోలు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ముందుగానే వైకాపా పోటీ నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments