Webdunia - Bharat's app for daily news and videos

Install App

విఫలమైన మంత్రుల వ్యూహాలు... సీఎం జగన్‌కు తొలి చెంపదెబ్బ...

Webdunia
గురువారం, 23 జనవరి 2020 (07:06 IST)
ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో ఆమోదించుకునేందుకు వైకాపా మంత్రులు శతవిధాలా ప్రయత్నించారు. ఇందుకోసం గంటల కొద్దీ శాసనసభలోనే ఉంటూ గంటగంటకో వ్యూహం రచించారు. కానీ, అవన్నీ పూర్తిగా విఫలంకావడంతో రాజధాని వికేంద్రీకరణ బిల్లుతో పాటు.. సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపుతూ ఛైర్మన్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులా మారింది. 
 
నిజానికి రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి వెళ్లకుండా చేయాలని వైకాపా మంత్రులు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ, తెదేపా సీనియర్ల ముందు ఘోరంగా విఫలమయ్యారు. ఈ బిల్లు సెలెక్ట్ కమిటీలో ఈ బిల్లు ప్రక్రియ ముగియడానికి కనీసం మూడు నెలలు పడుతోంది. అప్పటివరకు రాజధాని తరలింపు తాత్కాలికంగా ఆగినట్టే. 
 
నిజానికి రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియను ఆగమేఘాల మీద ముగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ముఖ్యంగా బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి పంపకుండా ఆపాలని పార్టీ సీనియర్లు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలను ఆదేశించారు. దీంతోవారంతా రెండు రోజుల పాటు శాసనమండలిలోనే మకాం వేశారు. అయినప్పటికీ తెదేపా సభ్యులతో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు గుండె నిబ్బరంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి బిల్లును  సెలెక్ట్ కమిటీకి పంపించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments