Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీలో చేరనున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (09:30 IST)
ఇటీవల భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 23వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. టీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధమైపోయారు. ఈ మేరకు ఆదివారం తన ముఖ్య అనుచరులతో నిర్వహించిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులోభాగంగా, 23వ తేదీ మధ్యాహ్నం భారీ ర్యాలీగా కన్నా గార్డెన్ నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీగా వెళ్లి టీడీపీ కుండవా కప్పుకోనున్నారు. 
 
బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఆదివారం తన అనుచరులతో ఏకంగా 4 గంటల పాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఇందులో భవిష్యత్ ప్రణాళికతో పాటు ఏ పార్టీలో చేరితో బాగుంటుందన్న అంశాలపై తన అనుచరులను అడిగి ఆయన అభిప్రాయాలు తెలుసుకున్నారు. వీరంతా తెలుగుదేశం పార్టీలో చేరాని ముక్తకంఠంతో చెప్పారు. దీంతో ఆయన టీడీపీ కండుపా కప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇందుకోసం ఈ నెల 23వ తేదీన గుంటూరులోని కన్నావారి తోటలోని తన నివాసం నుంచి తమ మద్దతుదారులు, అనుచరులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. అక్కడ చంద్రబాబు సమక్షంలో టీడీపీ సభ్యత్వం స్వీకరిస్తారు. ఆయనతో పాటు బీజేపీకి రాజీనామా చేసిన పలువురు నేతలు కూడా అదే రోజున టీడీపీలో చేరనున్నారు. 

సంబంధిత వార్తలు

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

లవ్ మీ చిత్రం రీష్యూట్ నిజమే - అందుకే శనివారం విడుదల చేస్తున్నాం : ఆశిష్

మంచు లక్ష్మి ఆదిపర్వం పై సెన్సార్ ప్రశంస - ఐదు భాషల్లో విడుదల

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments