Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీలో చేరనున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (09:30 IST)
ఇటీవల భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 23వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. టీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధమైపోయారు. ఈ మేరకు ఆదివారం తన ముఖ్య అనుచరులతో నిర్వహించిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులోభాగంగా, 23వ తేదీ మధ్యాహ్నం భారీ ర్యాలీగా కన్నా గార్డెన్ నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీగా వెళ్లి టీడీపీ కుండవా కప్పుకోనున్నారు. 
 
బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఆదివారం తన అనుచరులతో ఏకంగా 4 గంటల పాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఇందులో భవిష్యత్ ప్రణాళికతో పాటు ఏ పార్టీలో చేరితో బాగుంటుందన్న అంశాలపై తన అనుచరులను అడిగి ఆయన అభిప్రాయాలు తెలుసుకున్నారు. వీరంతా తెలుగుదేశం పార్టీలో చేరాని ముక్తకంఠంతో చెప్పారు. దీంతో ఆయన టీడీపీ కండుపా కప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇందుకోసం ఈ నెల 23వ తేదీన గుంటూరులోని కన్నావారి తోటలోని తన నివాసం నుంచి తమ మద్దతుదారులు, అనుచరులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. అక్కడ చంద్రబాబు సమక్షంలో టీడీపీ సభ్యత్వం స్వీకరిస్తారు. ఆయనతో పాటు బీజేపీకి రాజీనామా చేసిన పలువురు నేతలు కూడా అదే రోజున టీడీపీలో చేరనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments