తిరుపతి లడ్డూ వివాదం- వైవీ పిటిషన్‌పై సెప్టెంబర్ 25న విచారణ

సెల్వి
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (19:23 IST)
దేశంలో సంచలనం సృష్టించిన తిరుపతి లడ్డూ వివాదంపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సెప్టెంబర్ 25న విచారించేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం అంగీకరించింది.
 
గత వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో తిరుపతి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారనే ఆరోపణలపై నిజాన్ని వెలికితీసేందుకు సుబ్బారెడ్డి శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌ను బుధవారం విచారిస్తామని కోర్టు తెలిపిందని సుబ్బారెడ్డి తరపు న్యాయవాది పి సుధాకర్‌రెడ్డి తెలిపారు.
 
దీనిని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయనివ్వండి లేదా హైకోర్టు ఒక కమిటీని వేయనివ్వండి లేదా సీబీఐ విచారణ జరపనివ్వండని సుధాకర్ కోరారు. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ముఖ్యమంత్రి హోదాలో వున్న వ్యక్తి ధృవీకరించకుండా ఆరోపణలు చేయవద్దని సూచించారు.
 
ఎన్‌డిఎ శాసనసభా పక్ష సమావేశంలో, టిడిపి అధినేత, ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడు గత వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని కూడా వదిలిపెట్టలేదని, లడ్డూల తయారీకి నాసిరకం పదార్థాలు, జంతువుల కొవ్వును ఉపయోగించారని పేర్కొన్నారు. వైసీపీపై బురదజల్లేందుకు చంద్రబాబు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలను మభ్యపెట్టేందుకే చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments