Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి లడ్డూ వివాదం- వైవీ పిటిషన్‌పై సెప్టెంబర్ 25న విచారణ

సెల్వి
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (19:23 IST)
దేశంలో సంచలనం సృష్టించిన తిరుపతి లడ్డూ వివాదంపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సెప్టెంబర్ 25న విచారించేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం అంగీకరించింది.
 
గత వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో తిరుపతి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారనే ఆరోపణలపై నిజాన్ని వెలికితీసేందుకు సుబ్బారెడ్డి శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌ను బుధవారం విచారిస్తామని కోర్టు తెలిపిందని సుబ్బారెడ్డి తరపు న్యాయవాది పి సుధాకర్‌రెడ్డి తెలిపారు.
 
దీనిని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయనివ్వండి లేదా హైకోర్టు ఒక కమిటీని వేయనివ్వండి లేదా సీబీఐ విచారణ జరపనివ్వండని సుధాకర్ కోరారు. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ముఖ్యమంత్రి హోదాలో వున్న వ్యక్తి ధృవీకరించకుండా ఆరోపణలు చేయవద్దని సూచించారు.
 
ఎన్‌డిఎ శాసనసభా పక్ష సమావేశంలో, టిడిపి అధినేత, ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడు గత వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని కూడా వదిలిపెట్టలేదని, లడ్డూల తయారీకి నాసిరకం పదార్థాలు, జంతువుల కొవ్వును ఉపయోగించారని పేర్కొన్నారు. వైసీపీపై బురదజల్లేందుకు చంద్రబాబు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలను మభ్యపెట్టేందుకే చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments