Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు ఊరట.. ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు

సెల్వి
మంగళవారం, 10 డిశెంబరు 2024 (15:25 IST)
Ram Gopal Varma: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని కూడా కోర్టు ఆదేశించింది. అక్టోబర్ 2023లో అతని చిత్రం వ్యుహం విడుదల సందర్భంగా, మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో వర్మ చిత్రం పోస్టర్‌లను పోస్ట్ చేయడంతో వివాదం తలెత్తింది. 
 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను అవమానించేలా పోస్టులు కనిపిస్తున్నాయని ఎం. రామలింగయ్య అనే ఫిర్యాదుదారు ఆరోపించారు. అనకాపల్లి, గుంటూరు జిల్లాల్లోనూ ఇలాంటి కేసులు నమోదయ్యాయి.
 
ఈ వ్యవహారంపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో వర్మపై ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్‌లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈనెల 10న ఏడు సెక్షన్లతో రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు. అయితే రెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ వర్మ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించగా.. వర్మకు ఊరట లభించింది. రాంగోపాల్‌ వర్మకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేస్తూ తప్పకుండా విచారణకు హాజరుకావాలని ఆర్జీవీకి హైకోర్టు సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments