Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఉపాధ్యాయులకు ప్రమోషన్ తాయిలాలు

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (10:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేస్తామని హెచ్చరించిన ఉపాధ్యాయులపై ప్రమోషన్ అనే తాయిలం ప్రకటించింది. ఇందులోభాగంగా దాదాపు 10వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించింది. ఇందులోభాగంగా, 4 వేలమంది ఎస్జీటీలను ఎస్ఏలుగా ప్రమోషన్ చేసింది. 
 
అలాగే,998 మంది ఎస్ఏలను ప్రిన్సిపల్ (గ్రేడ్ 2)పోస్టులకు అప్‌గ్రేడ్ చేసింది. 2342 మంది ఉపాధ్యాయ పోస్టులను మార్పిడి చేసింది. ఈ మేరకు మంగళవారం ఏపీ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 
 
అలాగే, 52 ప్రీ స్కూళ్ళను ఉన్న పాఠశాలలుగా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమషనర్ బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీచేశారు. 
 
జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి పాఠశాల విద్యాశాఖలో వ్యవస్థీకృత సంస్కరణల అమలులో భాగంగా ఈ పదోన్నతులు కల్పించినట్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 
కాగా, తమ సీపీఎస్ విధానం రద్దుతో పాటు తమ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు ఒకటో తేదీన మిలియన్ మార్చ్ పేరుతో ఛలో విజయవాడ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులతో పాటు ఏపీ ఉద్యోగులు తలపెట్టారు. దీనిపై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఇపుడు పదోన్నతి తాయిలాలు ప్రకటించిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments