Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు.. కరోనా పరీక్ష ధరలు తగ్గింపు

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (10:40 IST)
ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు వసూలు చేసే ధరలను తగ్గించింది. ఐసీఎంఆర్ గుర్తింపు కలిగిన ఎన్.ఏ.బి.ఎల్ ప్రైవేట్ ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్ ధరను రూ.350గా నిర్ణయించింది. 
 
గతంలో ప్రభుత్వం పంపే ఆర్టీపీసీఆర్ శాంపిళ్లను పరీక్షించేందుకు ఒక్కో టెస్టుకు రూ.475, ఎన్.ఏ.బి.ఎల్ ల్యాబ్‌లో అయితే రూ.499 చొప్పున ధరలు ఉండేవి. ప్రస్తుతం ఈ ధరలను రూ.350గా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది. 
 
ఈ మేరకు సవరించిన ధరలను అన్ని ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు తప్పనిసరిగా వసూలు చేయాలని, ఈ సవరించిన రేట్ల ధరల పట్టికను ఆస్పత్రుల్లో ప్రదర్శించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఈ సవరించిన ధరలను మాత్రమే వసూలు చేయాలని, ఎవరైనా అధికధరను వసూలు చేస్తే మాత్రం ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరింది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. 
 
మరోవైపు, కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా, ఈ నెల 31వ తేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూను ప్రభుత్వం అమలు చేయనుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారి నుంచి రూ.100 వసూలు చేస్తారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments