Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ ఔదార్యం - కారుణ్య మరణం కింద ఒకరికి ఉద్యోగం

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (13:31 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోమారు ఔదార్యాన్ని చూపారు. కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన శుభవార్త చెప్పారు. ముఖ్యంగా, కోవిడ్‌ కారణంగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి వెంటనే కారుణ్య నిమాయకాల కింద ఉద్యోగాలు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
 
ఈ ప్రక్రియను ఈ యేడాది నవంబర్‌ 30 నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌-19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్‌ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధినిర్వహణలో అసువులు బాసిన ఉద్యోగులను ప్రభుత్వం ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటుందన్నారు. 
 
వారులేని లోటుతో ఆ కుటుంబాలు ఇబ్బందుల పాలు కాకూడదని ప్రజల మనసెరిగిన ప్రభుత్వంగా తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అధికారులు కూడా ఈ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments