Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో ఆరు నెలల పాటు జగనన్న సురక్ష పథకం కొనసాగింపు..

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (15:09 IST)
ఏపీలోని వైకాపా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత యేడాది నవంబరు, డిసెంబరు నెలల్లో తొలి విడతగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు కొనసాగించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. రెండు దశలో భాగంగా మరో ఆరు నెలల పాటు నిర్వహించేందుకు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. 
 
వచ్చే ఆరు నెలల పాటు నిర్వహించే రెండో దశ కార్యక్రమంలో 13,945 ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం ద్వారా 1,64,982 మంది పేషెంట్లను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు తరలించి వారికి ఉచిత వైద్య సేవలను అందించాలని నిర్ణయించింది. ఈ వైద్య సేవలను అందించే విషయంలో ఓ ఒక్క గ్రామాన్ని వదిలిపెట్టకూడదనే లక్ష్యంతో ముందుకు సాగాలే చర్యలు తీసుకోనున్నారు. 
 
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా సీఎం జగన్.. తొలి దశలో 50 రోజులకు పైగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో 60 లక్షల మందికిపైగా ప్రజలు ప్రయోజనం పొందుతారు. తొలిదశ కార్యక్రమంలో పీహెచ్‌సీలు, ఏఎన్ఎంలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో 1,45,35,705 ఇళ్లను సందర్శించి రోగులను ఇంటి ముంగిటలోనే 6,45,06,018 వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments