Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో రూ.500 కోట్ల అప్పును సేకరించిన జగన్ సర్కారు

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (13:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో 500 కోట్ల రూపాయల అప్పు తీసుకుంది. మొత్తం 18 యేళ్ల కాలానికి 7.85 వడ్డీతో ఈ మొత్తాన్ని సేకరించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పీకల్లోతు అప్పుల్లో కూరుకున్న విషయం తెల్సిందే. 
 
పైగా, ప్రతి మంగళవారం భారత రిజర్వు బ్యాంకు నుంచి అప్పు తీసుకోనిదే ప్రభుత్వం యంత్రాన్ని నడపలేని దుస్థితి నెలకొంది. దీంతో ప్రతి మంగళవారం ఆర్బీఐ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలానికి ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు క్రమం తప్పకుండా హాజరవుతూ కుప్పలు తెప్పలుగా అప్పులు సేకరిస్తున్నారు. 
 
ఈ క్రమంలో మంగళవారం మరో రూ.500 కోట్ల రుణాన్ని సేకరించింది. 18 యేళ్ల కాలానికి 7.85 శాతం వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాన్ని సేకరించింది. 
 
తాజా రుణంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు చేసిన మొత్తం అప్పులు రూ.52,108 కోట్లకు చేరింది. ఇప్పటికే కేంద్రం నిర్ధేశించిన ఎఫ్.ఆర్.బి.ఎం పరిధిని ఏపీ సర్కారు దిగ్విజయంగా దాటేసింది. ఈ క్రమంలో తాజాగా మరో రూ.500 కోట్ల రుణం తీసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments