Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో రూ.500 కోట్ల అప్పును సేకరించిన జగన్ సర్కారు

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (13:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో 500 కోట్ల రూపాయల అప్పు తీసుకుంది. మొత్తం 18 యేళ్ల కాలానికి 7.85 వడ్డీతో ఈ మొత్తాన్ని సేకరించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పీకల్లోతు అప్పుల్లో కూరుకున్న విషయం తెల్సిందే. 
 
పైగా, ప్రతి మంగళవారం భారత రిజర్వు బ్యాంకు నుంచి అప్పు తీసుకోనిదే ప్రభుత్వం యంత్రాన్ని నడపలేని దుస్థితి నెలకొంది. దీంతో ప్రతి మంగళవారం ఆర్బీఐ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలానికి ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు క్రమం తప్పకుండా హాజరవుతూ కుప్పలు తెప్పలుగా అప్పులు సేకరిస్తున్నారు. 
 
ఈ క్రమంలో మంగళవారం మరో రూ.500 కోట్ల రుణాన్ని సేకరించింది. 18 యేళ్ల కాలానికి 7.85 శాతం వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాన్ని సేకరించింది. 
 
తాజా రుణంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు చేసిన మొత్తం అప్పులు రూ.52,108 కోట్లకు చేరింది. ఇప్పటికే కేంద్రం నిర్ధేశించిన ఎఫ్.ఆర్.బి.ఎం పరిధిని ఏపీ సర్కారు దిగ్విజయంగా దాటేసింది. ఈ క్రమంలో తాజాగా మరో రూ.500 కోట్ల రుణం తీసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

తర్వాతి కథనం
Show comments