Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 3న ఏపీ మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామన్న జీఏడీ!!

ఠాగూర్
శుక్రవారం, 31 మే 2024 (08:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఈ నెల 13వ తేదీన ఏపీ అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరిగింది. జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇంతలోనే ఏపీలో సమీకరణాలు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి నుంచి విశాఖకు సామాగ్రి తరలిస్తుండగా, వాటిని సీఆర్డీఏ అధికారులు అడ్డుకున్నారు. పైగా, జూన్ 3వ తేదీన మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని ప్రకటించారు. 
 
అమరావతి నుంచి విశాఖకు సామాగ్రి తరలిపోతున్నట్టు కథనాలు వస్తున్న నేపథ్యంలో సీఆర్డీయే అధికారులు రంగంలోకి దిగారు. ఎన్ అండ్ టి గోదాము నుంచి నిర్మాణ సామాగ్రి తరలింపును సీఆర్డీఏ అధికారులు అడ్డుకున్నారు. తమ అనుమతి లేకుండా సామాగ్రి తరలించచవద్దని స్పష్టం చేశారు. 
 
అటు జూన్ 3వ తేదీన సచివాలయంలో మంత్రుల చాంబర్లు స్వాధీనానికి జేఏడీ (సాధారణ పరిపాలన శాఖ) ఆదేశాలు జారీచేసింది. సచివాలయం నుంచి ఎలాంటి సామాగ్రి బయటికి తీసుకెళ్లవద్దని స్పష్టం చేసింది. తన అనుమతి లేకుండా పత్రాలు, వస్తువులు తీసుకెళ్లవద్దని పేర్కొంది. 
 
మంత్రులు పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని ఫైళ్లు తరలించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. సచివాలయం నుంచి వెళ్లే వాహనాలు తనిఖీలు చేయాలని ఎస్పఎఫ్ సిబ్బందిని ఆదేశించింది. జూన్ మూడో తేదీన మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments