Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో యజమాని మృతి .. పలకరింపుకు ఎవరూ రాలేదనీ ఫ్యామిలీ సూసైడ్...

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (22:51 IST)
కరోనా వైరస్ అనే మహమ్మారి అనేక మంది జీవితాలను నాశనం చేస్తోంది. ఈ వైరస్ సోకి కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు తమ అనుకున్నవారు దూరమైపోయారన్న బాధను జీర్ణించుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో కరోనా వైరస్ సోకి కుటుంబ యజమాని చనిపోయారు. ఆ కుటుంబాన్ని పలుకరించేందుకు ఆ గ్రామంలోని ఏ ఒక్కరూ రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన మృతుని భార్య, ఇద్దరు పిల్లలు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని పసివేదల గ్రామానికి చెందిన నరసయ్య అనే వ్యక్తి కరోనా వైరస్ బారినపడి ఈ నెల 16వ తేదీన మృతి చెందారు. 
 
ఈ విషయం తెలిసినప్పటికీ బంధువులు కానీ, స్నేహితులు కానీ మిగిలిన కుటుంబ సభ్యులను పలకరించేందుకు రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నరసయ్య భార్య సునీత (50), కుమారుడు ఫణికుమార్ (25), కుమార్తె అపర్ణ (23) గత అర్థరాత్రి రైల్వే బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
అయితే, ఎగువున కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ ముగ్గురి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments