Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఒంటిపూట బడులు పొడగింపు

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (12:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర వ్యాప్తంగా బడులను ఒక్కపూట మాత్రమే నిర్వహిస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరానికిగాను ఈ నెల 12వ తేదీన ఒంటిపూట బడులను పునఃప్రారంభించారు. అయితే, ఎండల తీవ్ర అధికంగా ఉండటంతో ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులను నిర్వహించాలని తొలుత భావించారు. ప్రస్తుతం ఈ ఎండలు ఇంకా తగ్గకపోవడంతో మరోమారు ఒంటిపూట బడులను పొడగించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 24వ తేదీ వరకు ఒంటి పూట బడులను నిర్వహించాలని ఆదేశించారు. 
 
జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ ఎండలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులను జరపాలని నిర్ణయించారు. ఇప్పటికీ ఎండలు ఏమాత్రం తగ్గక పోవడంతో తాజాగా ఈ పొడగింపు నిర్ణయం తీసుకున్నారు. ఈ బడులను ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఇది అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు వర్తిస్తుదంని పాఠశాల విద్యాసఖ కమిషనర్ సురేశ్ కుమార్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments