Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు బాబులకు శుభవార్త చెప్పిన ఏపీ సీఎం జగన్ సర్కారు

Webdunia
ఆదివారం, 31 డిశెంబరు 2023 (14:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మందుబాబులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలను తెరిచివుంచే సమయాన్ని పొడగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. డిసెంబరు 31వ తేదీతో పాటు జనవరి ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులను అర్థరాత్రి వరకు తెరిచివుంచేలా ఆదేశించారు. ఈ మేరకు ఏపీ అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. సాధారణంగా ప్రతి రోజూ మద్యం షాపులు రాత్రి 10 గంటల వరకు, మరికొన్ని ప్రాంతాల్లో రాత్రి 11 గంటల వరకు తెరిచివుంచుతారు. 
 
కానీ, కొత్త సంవత్సరంరోజును పురస్కరించుకుని అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచివుంచుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో నటించే అన్ని ఈవెంట్స్‌లో ఈ రెండు రోజుల పాటు రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, ఇది కేవలం ఈవెంట్స్ నిర్వహించే ప్రదేశం లోపల మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇది కేవలం ఈవెంట్స్ నిర్వహించే ప్రదేశం లోపల మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మందుబాబులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments