Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ముగిసిన పోలింగ్.. హైదరాబాద్‌కు క్యూకట్టిన ఓటర్లు

ఠాగూర్
మంగళవారం, 14 మే 2024 (13:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలకు కూడా పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూళ్ళకు వచ్చిన ఓటర్లు.. పోలింగ్ ముగియడంతో తిరిగి తమ సొంతూళ్ళకు బయలుదేరారు. 
 
నిజానికి ఓట్లు వేసేందుకు రెండు రోజుల క్రితమే బయల్దేరిన ఏపీ ప్రజలు హైదరాబాద్ నగరాన్ని దాదాపు ఖాళీ చేశారు. సోమవారం పోలింగ్ ముగిసిపోవడంతో తమ గ్రామాల నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు.
 
సోమవారం మధ్యాహ్నం నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బస్సులు, కార్లు, టూవీలర్లపై ఏపీ నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
 
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. వందల సంఖ్యలో వాహనాలు ఒకేసారి తరలి రావడంతో హైదరాబాద్ వైపు వెళ్లే లైన్ల సంఖ్యను పెంచి ట్రాఫిక్ జామ్ తగ్గించేందుకు జీఎంఆర్ సిబ్బంది చర్యలు చేపట్టింది.
 
ఓటింగ్ నేపథ్యంలో ఈరోజు సెలవుదినం ప్రకటించారు. మంగళవారం వర్కింగ్ డే కావడంతో సోమవారమే ప్రజలు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఏపీతో పాటు కోదాడ, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి తిరిగి వస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం