Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 : కౌంటింగ్ కేంద్రం నుంచి జారుకున్న కొడాలి నాని!

వరుణ్
మంగళవారం, 4 జూన్ 2024 (11:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధిక్యంలో దూసుకెళుతుంది. మొత్తం 175 సీట్లకు గాను ఈ కూటమి 153 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ సునామీ సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన వైకాపా అభ్యర్థి కొడాలి నాని కౌంటింగ్ కేంద్రం నుంచి మెల్లగా జారుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు : అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి!! 
ఆంధ్రప్రేదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం ఉదయం నుంచి వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే మొత్తం 175 సీట్లలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 88 మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసి, ఏకంగా 153 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఫలితంగా టీడీపీ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు 153కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
వైకాపా కేవలం 23 చోట్ల మాత్రమే లీడ్‌లో ఉంది. తొలి రౌండ్‌ నుంచే కూటమి అభ్యర్థులు పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని కనబర్చారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో సత్తా చాటారు. వైకాపాకు పట్టు ఉన్నట్లుగా భావించే రాయలసీమ జిల్లాల్లోనూ కూటమికే అధిక్యంలో కొనసాగడం గమనార్హం. 
 
ఈ ఎన్నికల ఫలితాలు అనేక మంది టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు, రాజమహేంద్రవరం రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మంగళగిరిలో నారా లోకేశ్‌, పూతలపట్టులో మురళీమోహన్‌ ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్‌ ముగిసేసరికి చంద్రబాబుకు 1,594, బుచ్చయ్య చౌదరి 910 ఓట్ల ఆధిక్యం లభించింది.
 
జగ్గంపేట అసెంబ్లీ స్థానంలో జ్యోతుల నెహ్రూ, రాజమహేంద్రవరం సిటీలో ఆదిరెడ్డి వాసు, తిరువూరులో కొలికపూడి శ్రీనివాస్‌, చిత్తూరులో గురజాల జగన్‌మోహన్‌కు లీడ్‌ వచ్చింది. పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర, విజయవాడ సెంట్రల్‌లో బొండా ఉమా, బొబ్బిలిలో సుజయకృష్ణ రంగారావు, ఒంగోలులో దామచర్ల జనార్దన్‌, గుడివాడలో వెనిగండ్ల రాము, ఉండిలో రఘురామకృష్ణరాజు, గురజాలలో యరపతినేని శ్రీనివాస్‌, పాణ్యంలో గౌరు చరితారెడ్డి, పెనుకొండలో సవిత, మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, విశాఖపట్నం తూర్పులో వెలగపూడి రామకృష్ణబాబుకు లీడ్‌ వచ్చింది. రెండో రౌండ్‌ ముగిసేసరికి బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నారు. 

 

సంబంధిత వార్తలు

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments