Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ పెన్షన్ కానుక షురూ.. రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకోవచ్చు..

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (11:40 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. స్వగ్రామాలకు దూరంగా ఉంటూ పెన్షన్ సాయాన్ని కోల్పోతున్నవారికి మంచి అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది మంది లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వం పెన్షన్ అందిస్తోంది. 
 
కానీ లబ్ధిదారులు ఏనెలైనా పెన్షన్ తీసుకోకుంటే.. ఆ తర్వాతి నెలలో రెండూ కలిపి ఇచ్చే వెసులుబాటును తొలగించింది. లబ్ధిదారులంతా నెలనెలా కచ్చితంగా పెన్షన్ తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ మొత్తాన్ని అందజేస్తున్నారు. నెలనెలా దాదాపు 95శాతం మందికి పెన్షన్లు ఇంటివద్దే అందుతున్నాయి. వేలిముద్రలు పడకపోవడం, లబ్ధిదారులు ఇళ్లవద్ద లేకపోవడంతో అలాంటి వారికి మాత్రం సాయం అందడం లేదు. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ మాదిరిగానే పెన్షన్ కూడా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా తీసుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు తెలిపింది. 
 
పెన్షన్ పోర్టబిలిటీకి సంబంధించిన మార్గదర్శకాలను వెంటనే అమలు చేయాలని సెర్ప్ సీఈఓ.. డీఆర్డీఏ ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్ని కార్యాలయాలకు ఆదేశాలను జారీ చేశారు. త్వరలోనే పెన్షన్ పోర్టబిలిటీ ప్రారంభం కానుంది.  
 
వైఎస్ఆర్ పెన్షన్ కానుకా కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్న వారికి పెన్షన్ల పంపిణీ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ప్రతి నెలా మొదటి రోజు లబ్ధిదారులకు ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాక, గ్రామ వాలంటీర్లు తెల్లవారుజాము నుండి పెన్షన్ ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు.
 
రాష్ట్రవ్యాప్తంగా 60,50,650 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందించబడతాయి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం గ్రామ, వార్డు సెక్రటేరియట్ ఖాతాల్లో రూ.1,411.42 కోట్లు డిపాజిట్ చేసినట్లు తెలిపారు.
 
సాంకేతిక కారణాల వల్ల ఎవరికీ పెన్షన్ అందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామ వాలంటీర్లు ఇప్పటివరకు ఉదయం 7 గంటల వరకు 14.24 లక్షల మంది పెన్షనర్లకు పెన్షన్ పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments