Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుల ఆంధ్ర : ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయిలో 55 పైసలు అప్పే

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (10:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఆంధ్రగా మారనుందా? సీఎం జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయిలో 55 పైసలు అప్పు తెచ్చి ఖర్చు చేస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకునివుందని ఆర్థిక నిపుణులుతో పాటు... కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తేల్చింది. 
 
ఆర్థిక సంవత్సరం సగం కూడా పూర్తికాకముందే ఏడాది కాలానికి అంచనా వేసిన అప్పు మొత్తాన్ని తీసుకుంది. ప్రభుత్వం గత ఐదు నెలల్లో వివిధ రూపాల్లో రూ.84,617.23 కోట్లు సమీకరించగా, అందులో రూ.47,130.90 కోట్ల రుణాలు ఉన్నాయి. అంటే మొత్తం సమీకరించిన మొత్తంలో 55.7 శాతం అప్పుగా ఉందని కాగ్ గుర్తుచేసింది. 
 
ముఖ్యంగా, కరోనా మహమ్మారి కష్టకాలంలో ఆర్థిక కార్యకలాపాలు మందగించడం, పన్నులు, పన్నేతర ఆదాయాలు తగ్గిపోవడంతో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. సెక్యూరిటీల వేలం, ఇతర అప్పుల రూపంలో ఈ ఏడాది రూ.48,295.58 కోట్లు తీసుకోనున్నట్టు బడ్జెట్ అంచనాల సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఆగస్టు నాటికే ఆ మొత్తాన్ని తీసేసుకున్నట్టు కాగ్ నివేదిక తెలిపింది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments