Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (18:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. గత ఎన్నికల మేనిఫెస్టోలే వైకాపా పేర్కొన్నట్టుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఓ అధ్యయన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎస్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. 
 
మంత్రిమండలి నిర్ణయం మేరకు జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కోసం ఏర్పాటైన ఈ అధ్యయన కమిటీకి సీఎస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో సభ్యులుగా సీసీఎల్‌ఏ, జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ, ప్రణాళికా శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారిని నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. కమిటీ కన్వీనర్‌గా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఉండనున్నారు.

లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య ఆధారంగా ఏపీలో 25 జిల్లాలు ఏర్పడనున్నాయి. కాగా, 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు నిర్దేశించారు. ఈ కమిటీ నివేదికను పరిశీలించిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ సర్కారు చర్యలు తీసుకోనుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం ఒక్కో ఎంపీ స్థానాన్ని ఒక్కో జిల్లాగా ప్రకటించనున్నారు. ఆ ప్రకారంగా ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుపతి త్వరలోనే జిల్లా కేంద్రంగా అవతరించనుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments