Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెగని పీఆర్సీ పంచాయతీ - బెట్టువీడిని ఉద్యోగులు.. మెట్టుదిగని సర్కారు

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (11:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ పంచాయతీ ఇప్పట్లో తీరేలా లేదు. ప్రభుత్వం మెట్టు దిగడం లేదు. అటు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా బెట్టువీడటం లేదు. ఈ కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. పీఆర్సీ పంచాయతీపై ఉద్యోగ సంఘాలతో ఆరు గంటల పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సానుకూల ఫలితం రాలేదు.
 
ఈ చర్చల్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు 21 ప్రధాన అంశాలపై తమ వాదనలు వినిపించాయి. ఈ చర్చలు గురువారం కూడా జరుగనున్నాయి. 
 
పీఆర్సీ అమలులో చాలా ఆలస్యమైందని, వచ్చే రెండు రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. వీలైనంత త్వరగా పీఆర్సీ అమలుపై ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా, ప్రభుత్వం మాత్రం 15శాతం లోపు వేతన పెంపు ఇచ్చేందుకు సమ్మతించగా, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మాత్రం 34 శాతానికి తగ్గకుండా ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments