Webdunia - Bharat's app for daily news and videos

Install App

125 రోజుల్లోనే రూ.100 కోట్ల పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేశాం.. బాబు

సెల్వి
సోమవారం, 21 అక్టోబరు 2024 (18:35 IST)
పోలీసు శాఖకు చెందిన 763 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను ఇకపై తమ సర్కారు క్లియర్ చేస్తుందని, 6,100 మంది కానిస్టేబుళ్లను నియమిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 
 
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం (వైఎస్‌ఆర్‌సీపీ) పోలీసు శాఖకు చెందిన రూ.763 కోట్లకు పైగా బిల్లులు చెల్లించకుండా వదిలేసింది. 
 
పోలీసు శాఖకు సహకరించేందుకు దశలవారీగా నిర్ణయాలు తీసుకుంటామని, ఆ బిల్లులన్నీ క్లియర్ చేస్తామని పోలీసు సంస్మరణ దినోత్సవంలో భాగంగా బాబు తన ప్రసంగంలో తెలిపారు. పోలీసు శాఖలో పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం లాంటిదని పేర్కొన్న సీఎం.. దానికి తాను ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ సహకరిస్తున్నానని చెప్పారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 125 రోజుల్లోనే శాఖకు చెందిన రూ.100 కోట్ల పెండింగ్ బిల్లులను ఇప్పటికే క్లియర్ చేసిందని చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాల్సిన అవసరం వుందని.. పోలీసులు పాత ఫ్యాషన్ సాంకేతిక సాధనాలతో నేరస్థులతో పోరాడలేరని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments