Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రజలకు సీఎం జగన్.. విపక్ష నేత చంద్రబాబు శుభాకాంక్షలు

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (09:16 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 74వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ తమ నిబద్ధత, దేశభక్తితో మనం ఇవాళ ఇలా ఉండేందుకు కారణమైన ప్రతీ ఒక్కరికీ సెల్యూట్‌ అంటూ సీఎం వైఎస్‌ జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి శుభ సందర్భంలో వారు నెలకొల్పిన విలువలను కాపాడటంతో పాటు వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతిజ్ఞ చేయాలంటూ జగన్ తన ట్వీట్‌లో కోరారు.
 
74వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం వైఎస్ జగన్, విపక్ష నేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలకు ముందే ఇరువురు నేతలు భావోద్వేగంతో కూడిన ట్వీట్ల ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ విశిష్టతను కూడా అందులో పేర్కొన్నారు.
 
విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని ట్వీట్‌ ద్వారా పేర్కొన్నారు. బానిసత్వపు సంకెళ్ళను తెంచుకుని స్వేఛ్చను పొందిన రోజు ఇది. హక్కుల కోసం పోరాడి విజయం సాధించిన శుభదినం. ఏ దేశంలోనూ లేని రీతిలో ప్రాధమిక హక్కులను, ఆదేశిక సూత్రాలను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను మనకు అందించారు పెద్దలంటూ చంద్రబాబు తన ట్వట్‌లో పేర్కొన్నారు.
 
అలాగే పోరాడి సాధించుకున్న హక్కులను ఎక్కడ కాలరాసినా, వ్యవస్ధలను కూలదోసినా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినా... వాటిని నిలబెట్టుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉంది. లేదంటే దేశం కోసం మహనీయులు చేసిన త్యాగాలను వృధా పరచిన వాళ్ళం అవుతాం. దేశ ప్రజలందరికీ స్వాంతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ముగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments