Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు జపాన్ పర్యటన తొలి ఫలం : ఇసుజు పికప్ ట్రక్కుల ఫ్యాక్టరీ!

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (09:56 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యంమత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన ముగియకముందే సత్ఫలితాలనిస్తోంది. ఇందులోభాగంగా.. ఆటోమొబైల్ రంగంలో ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీగా పేరొందిన ఇసుజు కంపెనీ పికప్ ట్రక్కుల కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. 
 
చంద్రబాబు తన వెంట తీసుకెళ్లిన ప్రతినిధి బృందంతో కలిసి గత నాలుగు రోజులుగా జపాన్‌లో పర్యటిస్తున్న విషయం తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా జపాన్‌లోని పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. అలాగే, ఆటోమొబైల్ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన ఇసుజు కంపెనీ ప్రతినిధులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం ప్రతిపాదనలకు ముగ్ధులైన ఆ కంపెనీ ప్రతినిధులు, ఏపీలో పికప్ ట్రక్కుల కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
 
ఇక తన పర్యటనలో భాగంగా గురువారం జపాన్ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలతో చంద్రబాబు పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఇంకా రెండు రోజుల పర్యటన మిగిలి ఉన్న నేపథ్యంలో మరిన్ని కంపెనీలతో భేటీ కానున్న సీఎం, మరిన్ని ఒప్పందాలను సాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. 

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments