Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రివర్గ సమావేశం... నిధుల సమీకరణపై చర్చ

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (13:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఈ భేటీ సచివాలయంలోని మొదటిబ్లాక్‌లో జ‌రుగుతుంది. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా నూతన ఐటీ విధానంపై చ‌ర్చిస్తున్నారు. అలాగే, రాష్ట్రంలో అమ‌లు చేస్తోన్న‌ వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల, నిధుల సమీకరణపై చ‌ర్చిస్తున్న‌ట్లు తెలుస్తోంది.
 
పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో నెల‌కొన్న‌ జల వివాదాల గురించి కూడా మంత్రుల‌తో జ‌గ‌న్మోహన్ రెడ్డి వివరంగా చ‌ర్చిస్తున్నారు. ఏపీలో జాబ్ క్యాలెండర్ వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ప్రైవేట్ వ‌ర్సిటీల నియంత్రణ, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ వంటి అంశాలపై కేబినెట్‌లో చర్చించే అవ‌కాశం ఉంది.
 
ఈ కేబినెట్ భేటీలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు ఆమోద ముద్ర వేయ‌నున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు సాగు భూముల పంపిణీపై కూడా నిర్ణ‌యాలు తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఇళ్ల స్థలాలు క్రమబద్దీకరించే విష‌యంలో కేబినెట్ నిర్ణయం తీసుకునే అవ‌కాశం ఉంది.
 
టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం రూ.5,900 కోట్ల రుణానికి బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చే అంశంపై మంత్రుల అభిప్రాయాల‌ను జ‌గ‌న్ తీసుకోనున్నారు. క‌రోనా నియంత్రణతో పాటు మూడో దశ వ్యాప్తి జ‌రిగితే తీసుకోవాల్సిన చ‌ర్య‌ల వంటి అంశాలు కూడా చ‌ర్చించే అవకాశం ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments