Webdunia - Bharat's app for daily news and videos

Install App

26న మంత్రివర్గ భేటీ... రాజధాని మార్పుపై ఆర్డినెన్స్?

Webdunia
శనివారం, 22 ఫిబ్రవరి 2020 (10:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 26వ తేదీ బుధవారం జరుగనుంది. ఇందులో అత్యంత కీలకమైన అంశాలపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టు రద్దు బిల్లులపై ప్రత్యేక ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చే అంశంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. 
 
నిజానికి ఈ నెల 12వ తేదీన (రెండో బుధవారం) సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో స్థానిక ఎన్నికల సంస్కరణలపై ప్రధానంగా చర్చ జరిగింది. మద్యం, డబ్బు పంపిణీ వంటి ప్రలోభాలకు అభ్యర్ధులెవరైనా పాల్పడితే.. ఎన్నికల సమయంలోనూ.. ఎన్నికల తర్వాతా అనర్హుడిగా ప్రకటించేలా ఆర్డినెన్సు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్సు కూడా ఇచ్చారు. 
 
స్థానిక ఎన్నికల తర్వాతే బడ్జెట్‌ సమావేశాలను నిర్వహిద్దామని మంత్రులకు సీఎం ఆ సందర్భంగా చెప్పారు. కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ.. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉండటంతో.. 26న జరిగే కేబినెట్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments