Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం - నాగార్జున సాగర్‌ డ్యాంలను స్వాధీనం చేసుకోండి : ఏపీ

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (10:58 IST)
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెను వివాదంగా మారుతున్న శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కేంద్ర సర్కారుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
 
కృష్ణా జలాలను వినియోగించుకోవడాన్ని తెలంగాణ ప్రభుత్వం వివాదం చేస్తోందని, సమస్యను పరిష్కరించుకుందామని ఎంత ప్రయత్నించినప్పటికీ, ఘర్షణాత్మక వైఖరి వీడడం లేదని ఆరోపిస్తూ కేంద్రానికి ఏపీ ఫిర్యాదు చేసింది. విభజన చట్టానికి తెలంగాణ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపించింది. 
 
సాగర్ కుడి కాల్వకు గేట్లు ఆపరేట్ చేస్తున్న సిబ్బంది తెలంగాణకు చెందిన వారు కావడంతో, ఏపీకి సకాలంలో నీటిని విడుదల చేయడం లేదని, దాని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఏపీ, కేంద్రానికి తెలిపింది. రాష్ట్ర విభజన నాటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments