Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో చిక్కిన మరో చిరుత... ఇప్పటివరకు మొత్తం 4

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (09:07 IST)
తిరుమల తిరుపతి మార్గంలో మరో చిరుత పులి చిక్కింది. అలిపిరి - తిరుమల కాలిమార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఈ చిరుతపులి చిక్కినట్టు తితిదే అటవీశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు నాలుగు చిరుత పులులను బంధించినట్లయింది. తొలుత ఒక చిరుతను పట్టుకోగా, ఆ తర్వాత రెండు, ఇపుడు మరొక చిరుత పులిని పట్టుకున్నారు. 
 
కాగా, ఈ నాలుగో చిరుత పులిని బోనులో బంధించేందుకు వారం రోజులుగా అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత రోజూ బోను వరకు వచ్చి వెనుదిరుగుతున్నట్లు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఎట్టకేలకు బోనులో చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. 
 
కాగా, ఇటీవల కాలి నడక మార్గంలో నడిచివెళుతున్న ఓ చిన్నారిపై ఓ చిరుత దాడి చేసి చంపేసిన విషయం తెల్సిందే. దీంతో అప్రమత్తమైన తితిదే అదికారులు కాలి నడక మార్గంలో పలు రకాలైన భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా, మధ్యాహ్నం 2 గంటలకు పైబడి చిన్నారులు నడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. అలాగే, భక్తులకు రక్షణగా చేతి కర్రలను కూడా తితిదే ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments