Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో చిక్కిన మరో చిరుత... ఇప్పటివరకు మొత్తం 4

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (09:07 IST)
తిరుమల తిరుపతి మార్గంలో మరో చిరుత పులి చిక్కింది. అలిపిరి - తిరుమల కాలిమార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఈ చిరుతపులి చిక్కినట్టు తితిదే అటవీశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు నాలుగు చిరుత పులులను బంధించినట్లయింది. తొలుత ఒక చిరుతను పట్టుకోగా, ఆ తర్వాత రెండు, ఇపుడు మరొక చిరుత పులిని పట్టుకున్నారు. 
 
కాగా, ఈ నాలుగో చిరుత పులిని బోనులో బంధించేందుకు వారం రోజులుగా అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత రోజూ బోను వరకు వచ్చి వెనుదిరుగుతున్నట్లు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఎట్టకేలకు బోనులో చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. 
 
కాగా, ఇటీవల కాలి నడక మార్గంలో నడిచివెళుతున్న ఓ చిన్నారిపై ఓ చిరుత దాడి చేసి చంపేసిన విషయం తెల్సిందే. దీంతో అప్రమత్తమైన తితిదే అదికారులు కాలి నడక మార్గంలో పలు రకాలైన భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా, మధ్యాహ్నం 2 గంటలకు పైబడి చిన్నారులు నడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. అలాగే, భక్తులకు రక్షణగా చేతి కర్రలను కూడా తితిదే ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్లీజ్ అలా పిలవొద్దంటున్న అగ్ర హీరోయిన్!!

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments