Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో చిక్కిన మరో చిరుత... ఇప్పటివరకు మొత్తం 4

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (09:07 IST)
తిరుమల తిరుపతి మార్గంలో మరో చిరుత పులి చిక్కింది. అలిపిరి - తిరుమల కాలిమార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఈ చిరుతపులి చిక్కినట్టు తితిదే అటవీశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు నాలుగు చిరుత పులులను బంధించినట్లయింది. తొలుత ఒక చిరుతను పట్టుకోగా, ఆ తర్వాత రెండు, ఇపుడు మరొక చిరుత పులిని పట్టుకున్నారు. 
 
కాగా, ఈ నాలుగో చిరుత పులిని బోనులో బంధించేందుకు వారం రోజులుగా అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత రోజూ బోను వరకు వచ్చి వెనుదిరుగుతున్నట్లు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఎట్టకేలకు బోనులో చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. 
 
కాగా, ఇటీవల కాలి నడక మార్గంలో నడిచివెళుతున్న ఓ చిన్నారిపై ఓ చిరుత దాడి చేసి చంపేసిన విషయం తెల్సిందే. దీంతో అప్రమత్తమైన తితిదే అదికారులు కాలి నడక మార్గంలో పలు రకాలైన భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా, మధ్యాహ్నం 2 గంటలకు పైబడి చిన్నారులు నడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. అలాగే, భక్తులకు రక్షణగా చేతి కర్రలను కూడా తితిదే ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments