Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిషిత్ కారు వేగం 146 కి.మీ.. 0.5 సెకన్ల వ్యవధిలో ప్రమాదం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పి.నారాయణ కుమారుడు కారు ప్రమాదంపై హైదరాబాద్‌ ఆర్టీఏ అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదానికి గురైన సమయంలో నిమిషానికి

Webdunia
శనివారం, 27 మే 2017 (10:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పి.నారాయణ కుమారుడు కారు ప్రమాదంపై హైదరాబాద్‌ ఆర్టీఏ అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదానికి గురైన సమయంలో నిమిషానికి 2.46 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇటీవల హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.36లో జరిగిన కారు ప్రమాదంలో నిషిత్‌తో పాటు ఆయన స్నేహితుడు మృత్యువాతపడిన విషయం తెల్సిందే. 
 
ప్రమాదసమయంలో నిషిత్ కారును 200 పైగా కిలోమీటర్ల వేగంతో నడపడం వల్ల ప్రమాదం జరిగినట్టు భావించారు. ఈ ప్రమాదంపై అంతర్గత విచారణ చేపట్టిన ట్రాఫిక్ బృందం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిన వీడియో ఫుటేజీ ఆధారంగా నిషిత్ కారు వేగాన్ని ప్రాథమికంగా నిర్ధారించారు. 
 
మెట్రో పిల్లర్‌‌ నెం.8, 9 మధ్య 75 అడుగుల దూరం ఉందనీ, సాధారణంగా సీసీ కెమెరాలో సెకనుకు 24 ఫ్రేమ్స్‌ రికార్డవుతాయి. కానీ నిషిత కారు అతివేగంతో నడపటం వల్ల ప్రమాద సమయంలో 17 ఫ్రేమ్స్‌ మాత్రమే రికార్డయ్యాయి. అంటే, ఆ కారు నిమిషానికి 2.46 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు తేల్చారు. ప్రమాద సమయంలో కారు 146 కిలోమీటర్ల వేగంతో నడిపారని అంచనా వేశారు. 0.5 సెకను వ్యవధిలోనే ప్రమాదం జరిగి ఉండవచ్చనే అభిప్రాయానికి వచ్చారు.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments