Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళకు 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యం... బయలుదేరిన మూడు లారీలు

అమరావతి : కేరళ వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపించనుంది. ఇందులో భాగంగా సచివాలయంలోని ఒకటో నెంబర్ బ్లాక్ వద్ద బియ్యంతో బయలుదేరిన మూడు లారీలను సీఎం చంద్రబాబునాయుడు లాంఛనంగా మంగళవారం రాత్రి పచ్చజెండా ఊపారు. రెం

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (22:14 IST)
అమరావతి : కేరళ వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపించనుంది. ఇందులో భాగంగా సచివాలయంలోని ఒకటో నెంబర్ బ్లాక్ వద్ద బియ్యంతో బయలుదేరిన మూడు లారీలను సీఎం చంద్రబాబునాయుడు లాంఛనంగా మంగళవారం రాత్రి పచ్చజెండా ఊపారు. రెండు వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేరళలోని అయిదు జిల్లాల బాధితులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఇందులో అలపుఝా జిల్లాలోని చెర్తాలా ప్రాంత బాధితులకు, ఎర్నాకుళంలోని ఎడతలా ప్రజలకు 500 మెట్రిక్ టన్నుల చొప్పున, పతనాతిట్టా జిల్లాలోని ఆదూర్ టౌన్‌కు 400 మెట్రిక్ టన్నులు, పతనాతిట్టా టౌన్ ప్రజలకు 100 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. త్రిశూర్ జిల్లాలో త్రిశూర్ టౌన్ ప్రజలకు 400 మెట్రిక్ టన్నులు, వేనాఢ్ జిల్లాలో భేతరి టౌన్ వాసులకు 100 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయనున్నారు. 
 
బియ్యం పంపిణీపై ఇప్పటికే కేరళ రాష్ట్ర సివిల్ సప్లయ్ అధికారులకు ఏపీకి చెందిన అధికారులు సమాచారమందించారు. సచివాలయం నుంచి మూడు లారీలతో బియ్యాన్ని అధికారులు పంపించారు. వాటికి సీఎం చంద్రబాబునాయుడు జెండా ఊపి ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments