Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరాచక ఆంధ్రప్రదేశ్‌: అచ్చెన్నాయుడు

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (08:45 IST)
నవ్యాంధ్రప్రదేశ్‌ను సిఎం జగన్‌ అరాచక ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు విమర్శించారు. అభివృద్ధి పథంలో ముందుంచాల్సిన రాష్ట్రాన్ని అరాచకాలు, అకృత్యాలు, అన్యాయాల్లో ముందంజలో ఉంచారని ఆరోపించారు.

రెండేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలే గాని ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అమరావతి మండలం ఉంగుటూరు గ్రామంలో సర్పంచ్‌ భర్తపై వైసిపి నాయకులు మారణాయుధాలతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

24 గంటల్లో దోషులను అరెస్టు చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దాడికి పాల్పడిన రాయపాటి శివపై రౌడీషీట్‌ తెరిచి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

విశాఖ సహా, ఉత్తరాంధ్ర ప్రాంత టిడిపి బిసి నేతలే లక్ష్యంగా వైసిపి ఎంపి విజయసాయి, వైసిపి ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతున్నట్లు విమర్శించారు.

టిడిపి జారీ చేసిన పది డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వాహనమిత్ర పేరుతో ఆటో డ్రైవర్లకు సిఎం జగన్‌ పంగనామం పెడుతున్నారని, డీజిల్‌ ధరలు పెంపుతో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments