Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరాచక ఆంధ్రప్రదేశ్‌: అచ్చెన్నాయుడు

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (08:45 IST)
నవ్యాంధ్రప్రదేశ్‌ను సిఎం జగన్‌ అరాచక ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు విమర్శించారు. అభివృద్ధి పథంలో ముందుంచాల్సిన రాష్ట్రాన్ని అరాచకాలు, అకృత్యాలు, అన్యాయాల్లో ముందంజలో ఉంచారని ఆరోపించారు.

రెండేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలే గాని ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అమరావతి మండలం ఉంగుటూరు గ్రామంలో సర్పంచ్‌ భర్తపై వైసిపి నాయకులు మారణాయుధాలతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

24 గంటల్లో దోషులను అరెస్టు చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దాడికి పాల్పడిన రాయపాటి శివపై రౌడీషీట్‌ తెరిచి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

విశాఖ సహా, ఉత్తరాంధ్ర ప్రాంత టిడిపి బిసి నేతలే లక్ష్యంగా వైసిపి ఎంపి విజయసాయి, వైసిపి ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతున్నట్లు విమర్శించారు.

టిడిపి జారీ చేసిన పది డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వాహనమిత్ర పేరుతో ఆటో డ్రైవర్లకు సిఎం జగన్‌ పంగనామం పెడుతున్నారని, డీజిల్‌ ధరలు పెంపుతో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments