Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహితపై అత్యాచారానికి పాల్పడిన వాలంటీర్.. నాలుగు రోజులు?

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2023 (14:51 IST)
ఏపీలో వాలంటీర్ల అరాచకం పెరిగిపోతుంది. తాజాగా అనంతపురం జిల్లాలో ఓ వివాహితను 20 రోజులు బంధించిన వాలంటీర్ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. యాడికి మండలానికి చెందిన ఓ గ్రామానికి చెందిన వివాహిత మండల కేంద్రంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. అదే మండలం కోన ఉప్పలపాడు గ్రామానికి చెందిన దాసరి సతీశ్‌ గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్నాడు. 
 
సతీష్ గత 3 నెలలుగా వివాహిత ఇంటికి తరచూ వెళుతూ పరిచయం పెంచుకున్నాడు. ఈ నెల 7న వివాహిత తన ఆరేళ్ల కూతురితో దుకాణంలో ఉండగా సతీశ్‌ అక్కడికి కారులో వెళ్లాడు. ఆమెను బయటకు పిలిచి తన కోరిక తీర్చాలని లేదంటే భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. బలవంతంగా వివాహితను చిన్నారిని కారులో ఎక్కించుకుని రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఇలా బాధితురాలి కళ్ల ఎదుటే పలుసార్లు వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నాలుగు రోజులుగా తల్లీ కూతుళ్లు కనబడక పోవడంతో ఆమె కుటుంబసభ్యులు ఈ నెల 11న యాడికి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు తిరుపతి పోలీసుల సహకారంతో వివాహితను ఈ నెల 25న వాలంటీరు చెర నుంచి విడిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను వస్తున్నా.. ఆశీస్సులు కావాలంటూ నందమూరి మోక్షజ్న ట్వీట్

పుష్ప 2 కు అన్నీ అడ్డంకులే.. ముఖ్యంగా ఆ ఇద్దరే కారణమా?

ముంబైలో చెర్రీ ఇంట్లోనే వుండిపోయా.. ఎవరికీ చెప్పొద్దన్నాడు.. మంచు లక్ష్మి

రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ చిత్రం హంపిలో ప్రారంభం

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments