Webdunia - Bharat's app for daily news and videos

Install App

4 రోజుల్లో పెళ్లి.. వెడ్డింగ్ కార్డులు పంచేందుకు వెళ్లి... వరుడు మృతి

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (12:56 IST)
మరో నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకున్న వరుడు.. పెళ్లికి ఆహ్వాన పత్రికలు పంచేందుకు వెళ్ళి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా కదిరి మండలం ఎరుకలవాండ్లపల్లి సమీపంలో జరిగింది. 
 
ఈ నెల 27వ తేదీన కదిరిలో ఎర్రదొడ్డికి చెందిన మహేష్‌ (26)కు వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి సమయం దగ్గర పడుతుండటంతో బంధువులకు వివాహ పత్రికలను పంచేందుకు స్వగ్రామం నుంచి అర్థరాత్రి బయలుదేరిన మహేష్‌ కొద్ది సమయానికే గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. 
 
ఈ విషయం తెలిసిన కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. ఉపాధి కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లిన మహేష్‌ నెల రోజుల కిందటే పెళ్లి కోసం సొంత ఊరికి వచ్చారని, త్వరలో ఓ ఇంటివాడై కోడలితో కలిసి జంటగా వస్తాడనుకుంటే అందరిని వదిలేసి వెళ్లాడంటూ... కుటుంబీకులు, బంధువులు రోదించారు. దీనిపై స్తానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ అజిత్ కుమార్ సెకండ్ లుక్

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)

రిలీజ్ కు రెడీ అవుతోన్న గ్యాంగ్ స్టర్ మూవీ టీజర్ లాంఛ్

కల్కి రిలీజ్ తో కళకళలాడుతున్న థియేటర్స్

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వస్తున్న అగ్నిసాక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments