Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక....

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (15:37 IST)
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషాదకర ఘటన ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని చెన్నేకొత్తపల్లి మండలం, సీసీకొత్తపేట బస్టాప్ వద్ద జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన అంజలి అనే మహిళకు మహేంద్ర అనే వ్యక్తితో పదేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 
అయితే, అంజలికి తమ సమీప బంధువైన యోగానంద్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బంధువులకు తెలిసి ఇరువరిని మందలించడంతో మనస్థాపానికి గురయ్యారు. ఇకపై తామిద్దరం కలుసుకోలేమని భావించి వారిద్దరూ ఇంటి నుంచి గత శుక్రవారం పారిపోయారు. 
 
ఆ మరుసటి రోజు శనివారం సీసీకొత్తపేట బస్టాప్‌ సమీపంలో పురుగుల మందు తాగారు. స్థానికులు గుర్తించి వారిని ధర్మవరం దవాఖానకు తరలించగా అంజలి మృతి చెందింది. యోగానంద్‌ పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments