Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి పంపకంలో తగాదాలు... ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు సూసైడ్

Webdunia
బుధవారం, 8 మే 2019 (14:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఆస్తి పంపకం విషయంలో కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. వీరిలో ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది.
 
పెనుకొండ నియోజకవర్గం గోరంట్లలో ఓ కుటుంబంలో కలహాలు చెలరేగాయి. దీంతో రామకృష్ణమ్మ, ఆమె కుమారుడు వేణుగోపాల్, సోదరులు మోహన్, సోమశేఖర్ మంగళవారం రాత్రి ఊరి శ్మశానం వద్దకు చేరుకున్నారు. అనంతరం ఎలుకల మందును, సూపర్ వాస్మోల్ 33లో కలుపుకుని తాగడంతో అపస్మారకస్థితిలోకి జారుకున్నారు.
 
బుధవారం ఉదయం క్రమంలో ఉదయం గొర్రెలను మేపుకునేందుకు వెళ్లిన కాపరి వీరిని చూసి పోలీసులు, గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో గ్రామస్తులు వీరిని హుటాహుటిన హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మోహన్, సోమశేఖర్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
రామకృష్ణమ్మ, వేణుగోపాల్‌ల పరిస్థితి విషమంగా ఉందనీ, మరో 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments