అప్రకటిత కరెంట్ కోతలు - ఎండిపోతున్న పంటలు - విద్యుత్ సిబ్బంది నిర్బంధం

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (08:56 IST)
అప్రకటిత విద్యుత్ కోతలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, రైతులు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా, రైతులు మరింత మనోవేదనను అనుభవిస్తున్నారు. చేతికొచ్చిన పంట కళ్ళఎదుట ఎండిపోతుంటే చూస్తూ కంట కన్నీరు పెట్టుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. విద్యుత్ విద్యుత్ సిబ్బందిని నిర్బంధిస్తున్నారు. 
 
తాజాగా అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో విద్యుత్ సిబ్బందిని రైతుల నిర్బంధించారు. విద్యుత్ కోతలతో అల్లాడిపోతున్న రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో విద్యుత్ సిబ్బంది నిర్బంధించారు. 
 
పి.సిద్ధరాంపురం, కూడేరు మండలం ఎంఎం పల్లిలో రైతులు వేల ఎకరాల్లో పంటను సాగు చేశారు. రోజు ఆరు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయక పోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పి.సిద్ధరాంపురంలో విద్యుత్ సబ్ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. 
 
సబ్‌స్టేషనులో నిధులు నిర్వహిస్తున్న గదిలో నిర్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు సబ్ స్టషన్‌కు చేరుకుని రైతులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వచ్చి కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇవ్వండంతో శాంతించిన రైతులు సిబ్బందిని విడిచిపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments