మహిళపై విచక్షణారహితంగా దాడి.. ఎంత వేడుకున్నా...?

Webdunia
ఆదివారం, 15 డిశెంబరు 2019 (16:54 IST)
అనంతపురం జిల్లా హిందూపురం మండలంలోని మనే సముద్రం గ్రామంలో శనివారం రాత్రి లక్ష్మీదేవి అనే మహిళతో అదే గ్రామానికి చెందిన యువకులు సురేష్, శ్రీధర్‌లు విచక్షణారహితంగా దాడి చేశారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది ఆమె చనిపోతానని వేడుకొంటున్న వదలకుండా కాళ్లు చేతులతో కొట్టడమే గాక చంపడానికి గొంతునులిమి ప్రయత్నించడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది.
 
ఆమె కుమారుడు మా అమ్మను వదలాలని వేడుకుంటున్న వదలకుండా మహిళల అని  కూడా చూడకుండా దాడి చేయడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. గుర్తించిన స్థానికులు వెంటనే ఆమెను హిందూపురం ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం అనంతపురం అక్కడ నుంచి కర్నూలుకు తరలించారు. అయితే వారు  దాడి చేస్తున్న దృశ్యాలను అక్కడ ఉన్నవారు వీడియో తీయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ అయింది.
 
దీన్ని గుర్తించిన హిందూపురం పోలీసులు దాడి చేసి ఇద్దర్ని స్టేషన్ తరలించి విచారిస్తున్నట్లు సిఐ శ్రీనివాసులు తెలిపారు. అయితే సురేష్, శ్రీధర్‌లు గతంలో లక్ష్మీదేవి ఇంటిలో అద్దెకు ఉన్నారు. అప్పట్లో వారు మట్కా నిర్వహిస్తున్నారని తెలిసి పోలీసులు వారికి ఇల్లు ఇస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించడంతో, సురేష్, శ్రీధర్, ఇల్లు ఇవ్వను అని చెప్పడంతో ఆమెపై కక్ష పెంచుకున్నారు. 
 
మా డబ్బులు పది లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారని వారు పోలీసులుకు ఆమెపై స్టేషన్లో పిర్యాదు చేసారు. కానీ అప్పట్లో మట్కా వ్యవహరం బయటకు వస్తుందని రాజీ అయ్యారు. 
అప్పటునుంచి ఆమె పగ పెంచుకొని శనివారం రాత్రి దాడికి పాల్పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments